పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా మాస్ గ్యాంగ్ స్టార్ యాక్షన్ సినిమా ఓజి. ఈ సినిమాపై పవన్ ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా ఎన్నో విశేషమైన అంచనాలు ఉన్నాయి.
ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియ రెడ్డి వంటి నటులు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్నారు. సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తయ్యే దశకు చేరుకుంది.
కాగా తమ సినిమాని సెప్టెంబర్ 25న గ్రాండ్ లెవెల్లో పలు భాషల్లో రిలీజ్ చేయనున్నట్టు తాజాగా ఓజి మూవీ టీమ్ అయితే డేట్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. వాస్తవానికి పలుమార్లు రిలీజ్ వాయిదా పడ్డ ఈ సినిమా ఫైనల్ గా సెప్టెంబర్ 25 కి ఫిక్స్ అవ్వటంతో పవన్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక సరిగ్గా అదే డేట్ కి బాలకృష్ణ అఖండ 2 తో పాటు, సాయి ధరంతేజ్ సంబరాల ఏటిగట్టు మూవీస్ కూడా రిలీజ్ ఉండటంతో అవి రెండు ప్రస్తుత పరిస్థితుల్లో పక్కాగా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.
ఇక అక్టోబర్ మొదటి వారంలో కాంతారా ఏ లెజెండ్ తోపాటు ధనుష్ ఇడ్లీ కడై సినిమాల రిలీజ్ కూడా ఉన్నాయి. మరి ఓవరాల్ గా ఓజి రిలీజ్ అనంతరం ఏ స్థాయి విజయవంతం తెలియాలంటే మరికొన్ని నెలల వరకు వెయిట్ చేయక తప్పదు.