కన్నడ అందాల నటి రుక్మిణి వసంత్ ఇటీవల సప్త సాగరాలు దాటి సిరీస్ రెండు సినిమాల్లోని తన ఆకట్టుకునే అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుని మంచి క్రేజ్ అందుకున్నారు.
ఆ సినిమాల్లో పార్ట్ 1 విజయవంతం కాగా పార్ట్ 2 ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆ సినిమాల అనంతరం వరుసగా రుక్మిణి వసంత్ కి అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే తమిళ్ లో ఆమె శివ కార్తికేయన్ తో కలిసి మదరాసి సినిమా చేస్తున్నారు.
మరోవైపు తెలుగులో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ల కలయికలో రూపొందుతున్న మాస్ పాన్ ఇండియన్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ డ్రాగన్ లో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
అయితే లేటెస్ట్ టాలీవుడ్ అప్డేట్ ప్రకారం ఒక బడా తెలుగు మూవీతో పాటు మరొక తమిళ మూవీలో కూడా డుమిని వసంత్ ని తీసుకునేందుకు టీమ్స్ ప్రయత్నిస్తున్నాయట.
ఇటీవల తెలుగు లో నిఖిల్ తో ఆమె చేసిన అపుడో ఇపుడో ఎపుడో మూవీ ఫ్లాప్ అయింది. ఇక తాజగా విజయ్ సేతుపతితో ఆమె చేసిన ఏస్ మూవీ థియేటర్స్ లో ఉంది. మరి మొత్తంగా రాబోయే సినిమాలతో రుక్మిణి వసంత ఎంతమేర విజయాలు అందుకుంటారో చూడాలి.