యువ నటుడు సందీప్ కిషన్ హీరోగా రీతూ వర్మ హీరోయిన్ గా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ మజాకా. ఈ మూవీని జీ స్టూడియోస్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ సంస్థల పై రాజేష్ దండా, ఉమేష్ బన్సల్ గ్రాండ్ గా నిర్మించగా లియోన్ జేమ్స్ సంగీతం సమకూర్చారు.
ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో అందరిలో మంచి ఆసక్తిని ఏర్పరిచిన ఈ మూవీ ఫిబ్రవరి 26న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది. తాజగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ యూ / ఏ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది.
ఇక ఈ మూవీ యొక్క రన్ టైం 2 గం. ల 29. నిముషాలుగా ఉంది. ఆకట్టుకునే ఎంటర్టైనర్ గా రూపొందిన తమ మూవీ అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరిస్తుందని మజాకా టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. కోస్టల్ ఏపీ లోని 6 ప్రాంతాల్లో రూ. 4.5 కోట్ల నుండి 5 కోట్ల నిష్పత్తికి, అలానే నైజాం రూ. 3.5 కోట్లకు మరియు సీడెడ్ దాదాపు రూ. 2 కోట్లకు అమ్ముడయ్యాయి.
మొత్తం తెలుగు రాష్ట్రాల వ్యాపారం దాదాపు రూ. 10 కోట్లకు జరిగింది. ఓవరాల్ ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీకి రూ. 12 కోట్ల వ్యాపారం జరిగింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించాలంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 25 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి. ఇక ఈ మూవీ యొక్క నాన్ థియేట్రికల్ రైట్స్ ని జీ సంస్థ వారు భారీ ధరకు సొంతం చేసుకున్నారు.