కమలహాసన్ హీరోగా త్రిష హీరోయిన్ గా శింబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామా మూవీ థగ్ లైఫ్. చాలా ఏళ్ల అనంతరం కమలహాసన్ తో కలిసి మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమాని రెడ్ జెయింట్ మూవీస్, రాజ్ కమల్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ సంస్థలు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి.
నాజర్, తనికెళ్ళ భరణి, అభిరామి, మహేష్ మంజ్రేకర్ కీలక పాత్రలు చేసిన ఈమూవీకి ఏ ఆర్ రహమాన్ సంగీతం అందించారు. అయితే ఫస్ట్ డే నుంచి నెగిటివ్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా ప్రస్తుతం చాలా ఏరియాల్లో డిజాస్టర్ కలెక్షన్స్ తో కొనసాగుతోంది.
ఇప్పటివరకు కేవలం రూ.80 కోట్ల గ్రాస్ వద్ద మాత్రమే నిలిచిన తగ్ లైఫ్ మూవీ అటు తమిళనాడులో కూడా ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయట్లేదు.
మొత్తంగా తమిళనాడులో ఐదు రోజుల్లో ఈ మూవీ రు. 35 కోట్ల గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళలో కూడా ఈ సినిమా నెగిటివ్ టాక్ తో దారుణంగా రన్ అవుతుంది. మొత్తంగా దీన్ని బట్టి చూస్తే ఓవరాల్ గా అనేక ఏరియాల్లో థగ్ లైఫ్ సినిమా డిజాస్టర్ కలెక్షన్లతో కమల్ కెరీర్ లో మరొక భారీ పరాజయం దిశగా కొనసాగుతుంది.