HomeMovie NewsBalagam: బలగంను ఓటీటీలో తొందరగా విడుదల చేయాలనే నిర్మాతల నిర్ణయం తప్పు అంటున్న నెటిజన్లు

Balagam: బలగంను ఓటీటీలో తొందరగా విడుదల చేయాలనే నిర్మాతల నిర్ణయం తప్పు అంటున్న నెటిజన్లు

- Advertisement -

ఇటీవల విడుదలై ఘనవిజయం సాధించిన బలగం చిత్రం గత రాత్రి ఓటీటీలో అరంగేట్రం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే, థియేటర్లలో విడుదలైన 3 వారాలకే ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలనే నిర్మాతల నిర్ణయం పై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.

నిజానికి ఈ రోజుల్లో బాక్సాఫీస్ వద్ద 10 రోజులు కూడా మంచి వసూళ్లు రాబట్టడం సినిమాలకు కష్టంగా మారింది. అలాంటిది చిన్న చిత్రంగా విడుదలైన బలగం ఆశ్చర్యకరమైన బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది మరియు ప్రేక్షకుల నుండి అద్భుతమైన మౌత్ టాక్‌ వల్ల, ఈ చిత్రం 20 వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద రోజును నమోదు చేసింది, దీని ద్వారా సినిమా విజయం ఎంత పెద్దది అనేది రుజువు అవుతుంది.

అయితే మరుసటి రోజే ఓటీటీలో సినిమా ప్రసారం కావడంతో అందరూ షాక్ అయ్యారు మరియు నిర్మాతలు ఇంత తొందరగా ఓటీటీ స్ట్రీమింగ్‌ను ఎందుకు ఎంచుకున్నారని అడుగుతున్నారు. బహుశా సినిమా ఇంత పెద్ద హిట్ అవుతుందని ఎవరూ ఊహించి ఉండరు కాబట్టి నిర్మాతలు విడుదలకు ముందే భారీ ధరకు ఓటీటీ డీల్ క్లోజ్ చేసి ఉండొచ్చు.

కానీ ఈ చిత్రం థియేటర్లలో విడుదల అయ్యాక భారీ ప్రశంసలు మరియు వసూళ్లను పొందింది మరియు ఖచ్చితంగా కనీసం మరో 2-3 వారాలు నడిచే అవకాశం కూడా ఉండింది. బలగం నిర్మాతలు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌తో చర్చలను జరిపి విడుదలను వాయిదా వేయాల్సి ఉండిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

See also  Latest OTT Films: ఈ రోజు రాత్రి నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న మూడు తాజా తెలుగు సినిమాలు

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories