ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా ప్రభాస్, కాజల్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు వంటి దిగ్గజ నటులు కీలకపాత్రల్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ సినిమా కన్నప్ప. ఈ సినిమాపై అందరిలో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మూడు సాంగ్స్ తో పాటు ఫస్ట్ గ్లింప్స్ టీజర్, పోస్టర్స్ తో మంచి హైప్ ని ఏర్పర్చిన కన్నప్ప త్వరలో ఆడియన్స్ ముందుకు రానుంది.
ఈ సినిమాలోని గ్లింప్స్ టీజర్ లో శివయ్య అంటూ మంచు విష్ణు పలికినటువంటి డైలాగు ఆకట్టుకుని మీమర్స్ ద్వారా ఎంతో వైరల్ అయింది. ఇక తాజాగా మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా భైరవం. ఈ సినిమాపై కూడా అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి.
లేటెస్ట్ గా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా విష్ణు శివయ్య డైలాగ్ ని మంచు మనోజ్ పలికి అన్నయ్యని ఉద్దేశించి పరోక్షంగా కామెంట్స్ చేసారు. అనంతరం రియలైజ్ అయిన మనోజ్ క్షమాపణలు చెప్పారు.
నిజానికి ఒక సినిమా అనేది ఎంతోమంది నటీనటులు టెక్నీషియన్స్ టీం యొక్క శ్రమతో పూర్తవుతుందని కన్నప్పలో నటిస్తున్న ప్రతి ఒక్క నటుడిపై తనకు ఎంతో మంచి రెస్పెక్ట్ ఉందని అయితే ఒక వ్యక్తి కారణంగానే తన ఆ విధంగా ఆ మేం డైలాగుని భైరవం ఈవెంట్లో చెప్పడం జరిగిందని అన్నారు. మొత్తంగా తాను కూడా తమ సినిమాతో పాటు కన్నప్ప కూడా పెద్ద విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు మనోజ్.