కోలీవుడ్ ఇవ్వనప్పుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా కయదు లోహర్ అలానే అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా తెరకెక్కిన లేటెస్ట్ లవ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. తాజాగా ఈ మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ అతి త్వరలో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.
ఇక ఇటీవల సూర్య నటించిన భారీ ఎంటర్టైనర్ మూవీ కంగువా ఎన్నో అంచనాల మధ్య రిలీజై ఘోరంగా డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. సిరుత్తై శివ దర్శకత్వం వహించిన ఈ మూవీలో దిశా పటాని హీరోయిన్ గా నటించగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.
స్టూడియో గ్రీన్, యువి క్రియేషన్స్ సంస్థలు ఈ మూవీని నిర్మించాయి. విషయం ఏమిటంటే కంగువా సినిమా తెలుగు బయ్యర్లకి తాజాగా రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ హక్కులు అందించారు. ఒకవేళ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ గనక తెలుగులో కూడా మంచి విజయం అందుకుంటే చాలావరకు ఆ బయ్యర్లకు కంగువా వలన వచ్చిన నష్టాలు చాలా వరకు భర్తీ అయ్యే అవకాశం ఉంది. మరి అందరిలో మంచి క్రేజ్ ఏర్పరిచిన రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ రిలీజ్ అనంతరం ఎంతమేర విజయవంతం అవుతుందో చూడాలి.