దళపతి విజయ్ హీరోగా యువ దర్శకుడు హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమా జన నాయగన్. కెవిఎన్ ప్రొడక్షన్స్ సంస్థ పై ఎంతో భారీ ఎత్తున నిర్మితమవుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే, మమిత బైజు కీలకపాత్రలు చేస్తున్నారు.
అయితే ఈ సినిమా తెలుగు సూపర్ హిట్ మూవీ భగవంత్ కేసరికి అఫీషియల్ రీమేక్ అనేటువంటి వార్తలు కూడా కొన్నాళ్లుగా మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అసలు విషయం ఏమిటంటే ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ టీజర్ ని నేడు విజయ బర్త్ డే సందర్భంగా గ్రాండ్ గా రిలీజ్ చేసింది టీం.
ఈ టీజర్ కి మంచి రెస్పాన్స్ లభించినప్పటికీ టీజర్ లో అనిరుద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పై నెగిటివ్ విమర్శలు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా అనిరుద్ నుంచి ఎంతో ఆశించిన విజయ్ ఫ్యాన్స్ ఏమాత్రం బిజిఎం బాగాలేదని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా విజయ్ కెరీర్ ఆఖరి సినిమా కావటంతో ఫ్యాన్స్ దీని కోసం ఎంత ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు.
జన నాయగన్ మూవీని 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న గ్రాండ్ లెవెల్ లో అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు. మరి ఈ మూవీ ఎంతమేర సక్సెస్ అందుకుని ఏస్థాయి కలెక్షన్ సాధిస్తుందో తెలియాలి అంటే మరొక ఆరు నెలలు ఆగాల్సిందే.