టాలీవుడ్ స్టార్ యాక్టర్ మెగాపవర్ స్టార్ గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్ పై ఆయన ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో కూడా ఎన్నో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు భారీ వ్యయంతో నిర్మిస్తుండగా కీలక పాత్రల్లో ఎస్ జె సూర్య, ప్రకాష్ రాజ్, నాజర్, సునీల్, శ్రీకాంత్, అంజలి తదితరులు నటిస్తున్నారు.
ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఇక ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన రెండు సాంగ్స్ అందరినీ ఆకట్టుకుని ఇప్పటివరకు ఉన్న అంచనాలు మరింతగా పెంచేసాయని చెప్పాలి. ఇక గేమ్ ఛేంజర్ మూవీని వాస్తవానికి రానున్న క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20 న గ్రాండ్ గా రిలీజ్ చేయాలని భావించారు మేకర్స్.
ఇక తాజాగా అందుతున్న న్యూస్ ప్రకారం ఈ మూవీ పక్కాగా 2025 సంక్రాంతికి పోస్ట్ పోన్ ఫిక్స్ అంటున్నారు. అలానే ఈ మూవీని అన్ని కార్యక్రమాలు ముగించి జనవరి 10న గ్రాండ్ గా అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారట. రేపు దీనికి సంబంధించి మేకర్స్ అఫీషియల్ అనౌన్స్ మెంట్ అందించనున్నట్లు తెలుస్తోంది.