సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా మాస్ యాక్షన్ సినిమా కూలీ. ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ వ్యయంతో నిర్మిస్తుండగా శృతిహాసన్, ఉపేంద్ర, నాగార్జున, అమీర్ ఖాన్ తదితరులు కీలకపాత్రలు చేస్తున్నారు.
ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ చాలావరకు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 14న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు రానుంది. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై అన్ని భాషల ఆడియన్స్ లో భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.
ఇక ఈ సినిమాలో రజనీకాంత్ క్యారెక్టర్ ఎంతో మాస్ రేంజ్ లో పవర్ఫుల్ గా ఉంటుందని టాక్. అయితే విషయం ఏమిటంటే కూలీ సినిమా తెలుగు హక్కులు తాజాగా రూ. 50 కోట్ల భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఇక ఈ రైట్స్ ని ప్రముఖ టాలీవుడ్ నిర్మాత ఏషియన్ సునీల్ సొంతం చేసుకున్నారు.
కాగా ఇది రజనీకాంత్ గతంలో నటించిన 2.0 తర్వాత అత్యధిక ధర అని చెప్పాలి. మరోవైపు తమిళ్ లో కూడా ఈ సినిమాకి భారీగానే బిజినెస్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరి ఓవరాల్ గా అందరిలో మంచి అంచనాలు ఏర్పర్చిన కూలి మూవీ రిలీజ్ అనంతరం ఏస్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.