గత కొన్ని రోజులుగా అత్యంత భారీ స్థాయిలో ప్రచారంలో ఉన్న మరియు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూడగా ఈ వారం విడుదలైన అవతార్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తోంది.
మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తెలుగు రాష్ట్రాల్లో అవతార్ 2 సినిమా అనూహ్యంగా అద్భుతమైన వసూళ్లను సాధిస్తూ అందరినీ విస్మయానికి గురిచేస్తుంది.
తొలి రోజే ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 14.3 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. నిజానికి సినిమాకి మిశ్రమ సమీక్షలు ఉన్నప్పటికీ, ఈ చిత్రం వారాంతంలో సూపర్ స్ట్రాంగ్ గా ఉంది. ఒక మొదటి వారాంతంలో అవతార్ 2 తెలుగు రాష్ట్రాల నుండి దాదాపు 45 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
నైజాం ఏరియాలో ఈ సినిమా 23 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. రాబోయే రోజుల్లో క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వేడుకలు రానుండడంతో ఈ చిత్రం ఆ రోజుల్లో బలమైన పట్టును కొనసాగిస్తుందని ట్రేడ్ వర్గాలు ఆశిస్తున్నాయి.
కాగా అనుకున్నట్లు అవతార్ 2 బాక్సాఫీస్ వద్ద నిలకడగా ఉంటే కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే రకంగా 100 కోట్ల గ్రాస్ వసూలు మారే అన్ని అవకాశాలు ఉన్నాయి. ఆ ఘనత గనక సాధిస్తే అదొక అత్యద్భుతమైన సంఘటన అవుతుంది.
అవతార్ 2 హాలీవుడ్ చిత్రం అయినప్పటికీ, తెలుగు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది, ఎందుకంటే సినిమా ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా, హీరో తన కుటుంబాన్ని విలన్ల నుండి రక్షించడమే ప్రధాన కథ.
ఈ పాయింట్ ఎన్నో తెలుగు సినిమాలకు చాలా పోలి ఉంటుంది, అందుకే ప్రేక్షకులు ఈ సినిమాకి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారని విశ్లేషకులు మరియు ట్రేడ్ వర్గాల అభిప్రాయం.
అవతార్: ది వే ఆఫ్ వాటర్’ అనేది జేమ్స్ కామెరూన్ తన బృందంతో కలిసి వ్రాసిన ఒక అమెరికన్ ఎపిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం, ఇది హాలీవుడ్ లో ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన చిత్రాలలో ఒకటి కాగా జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించడంతో పాటు నిర్మించారు.