టాలీవుడ్ స్టార్ యాక్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి కలిసి తెరకెక్కిస్తున్న లేటెస్ట్ హిస్టారికల్ యాక్షన్ పాన్ ఇండియన్ డ్రామా మూవీ హరి హర వీర మల్లు. ఈ మూవీలో యువ నటి నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఇతర కీలక పాత్రల్లో బాబీ డియోల్, నోరా ఫతేహి, నర్గీస్ ఫక్రి, అనసూయ తదితరులు నటిస్తున్నారు.
ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ గ్రాండ్ మూవీని భారీ వ్యయంతో రెండు భాగాలుగా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ ఎం రత్నం నిర్మిస్తున్నారు. కాగా మొదటి భాగం జూన్ 13న ఆడియన్స్ ముందుకి రానుంది. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన గ్లింప్స్ టీజర్స్ తో పాటు సాంగ్స్ పర్వాలేదనిపించే రెస్పాన్స్ అందుకున్నాయి.
అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా తమ మూవీ యొక్క బిజినెస్ రూమర్స్ గురించి క్లారిటీ ఇచ్చారు నిర్మాత రత్నం. కొంత అధికంగా పలు ప్రాంతాల బిజినెస్ రేట్స్ కారణంగా హరి హర వీర మల్లుకి సంబంధించి ఇండియా లోని అనేక ఏరియాల్లో బిజినెస్ ఇంకా క్లోజ్ కాలేదని, అందుకే వీటిపై కొందరు రూమర్స్ క్రియేట్ చేస్తున్నారని అన్నారు.
అయితే ట్రైలర్ రిలీజ్ అనంతరం అంత పక్కాగా సర్దుకుంటుందని, అలానే తమ సినిమా ఎంతటి గ్రాండ్ స్కేల్ లో రూపొందిందనేది అందరికీ అర్ధం అవుతుందని అన్నారు. పవన్ కళ్యాణ్ పెర్ఫార్మన్స్ ఈమూవీకి ప్రధాన హైలైట్ అని తప్పకుండా మూవీ పెద్ద విజయం అందుకోవడం ఖాయం అని తెలిపారు.