Homeసినిమా వార్తలుభారీ ధరకు అమ్ముడైన 'భైరవం' నాన్ థియేట్రికల్ రైట్స్

భారీ ధరకు అమ్ముడైన ‘భైరవం’ నాన్ థియేట్రికల్ రైట్స్

- Advertisement -

ఇటీవల తమిళ్ లో రిలీజ్ అయి పెద్ద విజయం అందుకున్నటువంటి యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ గరుడన్. కాగా ఈ సినిమాకి తాజాగా తెలుగు రీమేక్ గా తెరకెక్కింది భైరవం. ఈ సినిమాలో యువ నటులు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధ మోహన్ గ్రాండ్ లెవెల్ లో రూ. 45 కోట్లతో నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయినటువంటి ప్రచార చిత్రాలన్నీ కూడా అందరిని ఆకట్టుకుని సినిమాపై బాగానే అంచనాలు అయితే ఏర్పరిచాయి.

ఇక ఈ సినిమాకు సంబంధించి ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ప్రకారం నాన్ థియెట్రికల్ రైట్స్ భారీ స్థాయిలో జరిగిందని తాజాగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తెలిపారు. ఓవరాల్ గా ఈ సినిమాకి నాన్ థియేటర్ రైట్స్ రూ. 30 కోట్లకు సేల్స్ జరుగగా తప్పకుండా ఇది రిలీజ్ అనంతరం బాగా రాబడుతుందని హీరోలతో పాటు టీం అయితే ఆశాభావం వ్యక్తం చేస్తుంది.

READ  'విశ్వంభర' రిలీజ్ డేట్ లాక్ ?

అయితే బెల్లంకొండ శ్రీనివాస్ హిందీ డబ్బింగ్ సినిమాలు యూట్యూబ్ మాద్యమంలో వందల మిలియన్స్ తో పాటు టీవీల్లో మంచి రేటింగ్స్ అందుకోవడంతో అది ఈ సినిమా బిజినెస్ కి కొంత ప్లస్ అయిందని తెలుస్తోంది.

మంచి పాజిటివ్ టాక్ కనుక వస్తే భైరవం సినిమా భారీ కలెక్షన్ అందుకునే అవకాశం ఉంటుంది. దివ్య పిళ్ళై, అదితిశంకర్, ఆనంది హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమా మే 30న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు రానుంది. మరి ఈ మూవీ ఎంతమేర విజయం అందుకుంటుందో చూడాలి.

Follow on Google News Follow on Whatsapp

READ  'భైరవం' ఈవెంట్ లో ఎమోషనల్ అయిన మంచు మనోజ్ 


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories