పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ కలిసి తెరకెక్కిస్తున్న తాజా సినిమా హరిహర వీరమల్లు పార్ట్ వన్. ఈ మూవీలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియన్ మూవీ పై పవన్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా విశేషమైన అంచనాలు ఉన్నాయి.
అయితే విషయం ఏమిటంటే ఇప్పటికే హరిహర వీరమల్ల నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ అయితే అందుకోలేకపోయాయి. మరోవైపు ఈ మూవీ యొక్క థియేటర్ ట్రైలర్ కోసం అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.
బిజినెస్ పరంగా కూడా హరిహర వీరమల్లు ప్రస్తుతం హోల్డ్ లో ఉండటంతో ఓవరాల్ గా ట్రైలర్ రిలీజ్ అనంతరం అంచనాలు మరింతగా పెరగటం ఖాయమని అంటున్నారు. ఒక సినిమాకి ట్రైలర్ అనేది ఎంతో ముఖ్యం అనేది తెలిసిందే. అయితే పక్కాగా ఈ మూవీ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దానిపై క్లారిటీ రావాలి.
మరోవైపు అతి త్వరలో ఈ మూవీ యొక్క అఫీషియల్ రిలీజ్ డేట్ ని కూడా టీం అనౌన్స్ చేయనుంది. పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తికరంగా ఎప్పటి నుంచొ ఎదురుచూస్తున్నారు. మరి రిలీజ్ అనంతరం హరిహర వీరమల్లు ఎంత మేర మెప్పిస్తుందో చూడాలి.