కింగ్ అక్కినేని నాగార్జున, వెర్సటైల్ యాక్టర్ ధనుష్ ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ములు తెరకెక్కిస్తున్న తాజా యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా కుబేర. నేషనల్ క్రైస్ట్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు గ్రాండ్ గా నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ బాగానే రెస్పాన్స్ సంపాదించుకొని సినిమాపై మంచి అంచనాలు ఏర్పరిచాయి.
ఈ మూవీ నుంచి మూడో సాంగ్ నిన్న రిలీజ్ చేశారు. ఇక తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న కుబేర కి U / A సర్టిఫికెట్ అందించింది సెన్సార్ బోర్డు.
అయితే షాకింగ్ విషయం ఏమిటంటే కుబేర మూవీ ఓవరాల్ గా 3 గంటల 15 నిమిషాల 27 సెకండ్ల పాటు నిడివి కలిగి ఉంది. ఒక రకంగా ఇది అధిక నిడివి కలిగిన సినిమా అయినప్పటికీ దర్శకుడు శేఖర్ కమ్ముల మ్యాజిక్ సినిమాలో అదిరిపోతుందని చెప్తోంది టీం.
మొత్తంగా అయితే కుబేర జూన్ 20న రిలీజ్ అనంతరం ఆడియన్స్ అందర్నీ ఆకట్టుకొని భారీ విజయం అందుకోవటం ఖాయమని అంటుంది సినిమా టీం. మరి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ ఎంతమేర విజయం అందుకుంటుందో చూడాలి