మోహన్ లాల్ హీరోగా జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన థ్రిల్లింగ్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ దృశ్యం సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఈ మలయాళ సినిమాకి ఇటీవల సీక్వెల్ అయిన దృశ్యం 2 కూడా మరింత పెద్ద విజయం సొంతం చేసుకుంది. ఇక దీని అనంతరం రానున్న మూడో భాగం కోసం ఎప్పటినుంచో సినిమా లవర్స్ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి దృశ్యం మూవీ తెలుగులో వెంకటేష్ హిందీ లో అజయ్ దేవగన్ చేయగా రెండు భాషల్లో కూడా విజయాలు అందుకున్నాయి.
పార్ట్ 1, పార్ట్ 2 అనంతరం పార్ట్-3 ని నిన్న అఫీషియల్ గా నిర్మాతలైన ఆశీర్వాద్ సినిమాస్ వారు అనౌన్స్ చేశారు. మోహన్ లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్లో రానున్న దృశ్యం 3, గతంలోని రెండు భాగాల కంటే మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని తెలుస్తోంది.
అక్టోబర్ నుంచి ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. మరోవైపు దృశ్యం 3 ని ఇటీవల అజయ్ దేవగన్ హీరోగా హిందీలో అనౌన్స్ చేశారు. అయితే అది సరికొత్త కథనా లేకపోతే ఇదే కథతో తెరకెక్కిస్తారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. అయితే ఈ మూవీ ఎప్పటికి పూర్తి అయి, ఎప్పుడు ఆడియన్స్ ముందుకి వస్తుంది అనే దాని పై మాత్రం క్లారిటీ రావాలి ఉంది.