నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న ల కలయికలో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన తాజా సినిమా కుబేర. ఇటీవల మంచి అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్ తో బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. దానితో ప్రేక్షకులకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపేందుకు నేడు గ్రాండ్ సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసింది కుబేర టీం.
రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, అమీగోస్ క్రియేషన్స్ సంస్థలు గ్రాండ్ గా దీనిని నిర్మించాయి. ఇక నేటి సక్సెస్ మీట్ కి మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా చీఫ్ గెస్ట్ గా విచ్చేశారు.
ఆయన మాట్లాడుతూ కుబేర సినిమాలో నటీనటుల కంటే ఆయా పాత్రలే సినిమా మొత్తం కనిపించాయని, అధ్యంతం ఆకట్టుకునే రీతిన మూవీని తెరకెక్కించిన దర్శకుడు శేఖర్ కమ్ములకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు మెగాస్టార్.
అలానే ఈ సినిమాలో దేవా పాత్రలో నటించిన ధనుష్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని ఇప్పటికే పలు నేషనల్ అవార్డులు తన ఖాతాలో వేసుకున్న ధనుష్ ఈ సినిమాతో మరొకసారి బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అందుకోవటం ఖాయమని ముందస్తుగా తనకు విజయాభినందనలు తెలియజేశారు మెగాస్టార్. నాగార్జున, రష్మిక మందన్న తోపాటు టీం మొత్తం కూడా అద్భుతంగా పెర్ఫాన్ చేశారని చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు.