నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్ ల కాంబినేషన్లో తెరకెక్కిన తాజా మూవీ భైరవం. విజయ్ కనకమేడల తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవల తమిళ్ లో రిలీజ్ అయి సక్సెస్ సాధించిన గరుడన్ కి అధికారిక రీమేక్ అనేది తెలిసిందే. దివ్య పెళ్లై, ఆనంది, అదితి శంకర్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా మే 30న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు వచ్చింది.
మొదటి రోజు మంచి టాక్ సంపాదించుకున్న ఈ సినిమా ఫస్ట్ డే రూ. 3.5 కోట్ల గ్రాస్ ని సొంతం చేసుకుంది. అయితే రెండో రోజు నుంచి ఆశించిన స్థాయి కలెక్షన్స్ దీనికి లభించడం లేదు.
మొత్తం మొదటి వారాంతానికి భైరవం మూవీ రూ. 8.30 కోట్ల గ్రాస్ ని అలానే రూ.4 కోట్ల షేర్ ని అందుకుంది. ఒకరకంగా ఇది ఆ మూవీ టీమ్ ని బాగా డిసప్పాయింట్ చేసే విషయం అని చెప్పాలి. ముఖ్యంగా ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ యాక్టింగ్ కి అందరు నుంచి విశేషమైన ప్రశంసలు కురుస్తున్నాయి.
మరోవైపు తాజాగా ఖలేజా రీ రిలీజ్ ఎఫెక్ట్ కూడా ఈ సినిమా పడగా అలానే ఇంకోవైపు ఐపీఎల్ సంబంధించిన ఎఫెక్ట్ కూడా ఉందనేది తెలుస్తుంది. మరి ఓవరాల్ గా భైరవం మూవీ ఏ స్థాయిలో కలెక్షన్ అందుకుంటుంది ఎంతమేరా బాక్సాఫీస్ వద్ద ఫలితం అందుకుంటుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాలి.