నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఇటీవల తెరకెక్కిన మాస్ యాక్షన్ మూవీ వీర సింహారెడ్డి. ఈ మూవీలో శృతి హాసన్, హానీ రోజ్ హీరోయిన్స్ గా నటించగా విలన్ గా కన్నడ నటుడు దునియా విజయ్ కనిపించారు.
మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఎంతో గ్రాండ్ గా నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బాగానే విజయవంతం అయింది. ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో అఖండ 2 మూవీ చేస్తున్నారు బాలకృష్ణ. దీని పై అందరిలో భారీ క్రేజ్ ఉంది. ఈ ఏడాది చివర్లో ఇది ఆడియన్స్ ముందుకి రానుంది.
అయితే విషయం ఏమిటంటే, దీని అనంతరం గోపీచంద్ మలినేనితో తన నెక్స్ట్ మూవీ చేయనున్నారు నందమూరి బాలకృష్ణ.
దీనిని ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చి బాబు ల పెద్ది మూవీ నిర్మాత వెంకట సతీష్ కిలారు గ్రాండ్ గా నిర్మించనుండగా గతంలో వచ్చిన వీర సింహారెడ్డిని మించి టాలీవుడ్ లో నిలిచిపోయేలా దర్శకుడు గోపీచంద్ తెరకెక్కించనున్నట్లు టాక్.
ఈ క్రేజీ కాంబో ప్రాజక్ట్ గురించి నిన్న న్యూస్ రావడంతో నందమూరి ఫాన్స్ దీని పై మరింత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. త్వరలో పట్టాలెక్కనున్న ఈ మూవీ వచ్చే ఏడాది ఆడియన్స్ ముందుకి రానుంది.